కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):
రాజీవ్ గాంధీ
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో పని చేస్తున్న 157 మంది స్టాఫ్ నర్సులను
గురువారం నాడు అధికారులు తొలగించారని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్
ఎంప్లాయిస్ యూనియన్( సిఐటియు)రిమ్స్ అధ్యక్షులు అక్రం ఖాన్ లు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.వెంటనే
వీరిని విడుల్లోకి తీసుకోవాలని కోరినారు.ఏడాది పాటు
ప్రాణాలకు తెగించి కోవిడ్ రోగులకు సేవలు అందించిన తమను ప్రభుత్వం ఎలాంటి సమాచారం
ఇవ్వకుండా తొలగించ రాణి వారు ఆవేదన వ్యక్తం చేసినారు. కరోన సోకిన రోగికి బంధువులే
రక్తసంబంధీకులు కూడా దగ్గరకు రాలేదని అలాంటి వారికి సేవలు మేము అందించారని తెలిపారు. కోవిడ్ సమయంలో మాత్రం ఎవరికీ తమ
ప్రాణాలు గురించి పట్టించుకోలేదని సేవలందించిన మమ్ములను ప్రభుత్వం వెంటనే
విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.